Thursday, May 8, 2025

ఉగ్రస్థావరాలను పక్కాగా పసిగట్టిన ఎన్‌టిఆర్‌వో

అది ఇచ్చిన ఖచ్చిత సమాచారంతోనే దాడులు

పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకున్న వేళ లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించడంలో కీలక పాత్ర ఎవరన్నది చర్చ సాగుతోంది. ఆపరేషన్‌ సిందూర్‌ విజయం వెనుక ఉన్న ఏజెన్సీ ఏంటి? అనే విషయాలపై చర్చ సాగుతోంది.  పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్‌ ఆర్మీ నేలమట్టం చేసింది. దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టు బెట్టింది. బుధవారం తెల్లవారుజామున భారత సాయుధ దళాలు బహవల్‌పూర్‌లోని జైష్‌ఎ మొహమ్మద్‌ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరేఎతోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి. అయితే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాలను భారతదేశం ఎలా ట్రాక్‌ చేసిందన్న ప్రశ్న ఉదయిస్తోంది.

పాకిస్తాన్‌, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లో దాక్కున్న ఉగ్రవాదులను జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ ఎన్‌టిఆర్‌ఓ గుర్తించింది. వారి స్థానాల గురించి నిఘా సమాచారాన్ని అందించింది. భారత దాడుల్లో అనేక మంది అగ్ర ఉగ్రవాద కమాండర్లు మరణించి ఉండవచ్చని భారత సైన్యం అంచనా వేస్తోంది. ఎన్‌టిఆర్‌వో అనేది 2004లో స్థాపించబడిన భారతదేశ సాంకేతిక నిఘా సంస్థ. ఇది జాతీయ భద్రతా సలహాదారు.

ప్రధాన మంత్రి కార్యాలయం కింద పనిచేస్తుంది. అధునాతన సాంకేతిక నిఘాను సేకరించడం, భారతదేశ జాతీయ భద్రతను కాపాడటంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఉగ్రవాదం, సైబర్‌ బెదిరింపులు, సరిహద్దు ముప్పులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కిక్ష అత్యాధునిక సాంకేతికత పరికరాలను ఉపయోగించడం వలన ఉగ్రవాదులను ట్రాక్‌ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com