ఒడిశా మాజీ గవర్నర్ మురళీధర్ చంద్రకాంత్ భండారే (95) శనివారం కన్నుమూశారు.. ఆయన మృతి పట్ల ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు.
భండారే మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు.. మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేశారు. ఆగస్టు 2007 నుంచి మార్చి 2013 వరకు ఒడిశా గవర్నర్గా పని చేశారు.