[12:35 PM, 2/1/2025] Sampath Sir: గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. వారికి ఆరోగ్య బీమా కల్పిస్తామని బడ్జెట్లో ప్రకటించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా కోటి మందికిపైగా ఆన్లైన్ డెలివరీ వర్కర్లకు ప్రయోజనం చేకూరనుంది. మన దేశంలో గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆన్లైన్ ఫుడ్, గ్రాసరీ, ఇతర వస్తువులు ఆన్లైన్ ద్వారా డెలివరీ చేసేందుకు చాలా సంస్థలు అందుబాటులోకి వస్తున్న క్రమంలో గిగ్ వర్కర్లకు డిమాండ్ పెరిగింది. తాజాగా వారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త అందించారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా గిగ్ వర్కర్ల కోసం ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రకటించారు. దీని ద్వారా దేశంలోని కోటి మందికిపైగా ఆన్లైన్ డెలివరీ వర్కర్లకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
‘గిగ్ వర్కర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందిస్తాం. ఇ-శ్రమ్ పోర్టల్ కింద వారికి ప్రత్యేక గుర్తింపు కల్పిస్తాం. అలాగే పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పిస్తాం. దీని ద్వారా కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలుగుతుంది’ అని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
బడ్జెట్లో గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే పథకం తీసుకొస్తారని మొదటి నుంచే అంచనాలు ఉన్నాయి. ఓ సందర్భంగా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తున్న్టలు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సమితా దావ్రా చెప్పారు. ఇప్పుడు గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లు సంప్రదాయ ఉద్యోగుల కాదని కార్మిక శాఖ కార్యదర్శి దావ్రా తెలిపారు. వారికి ఎలాంటి సామాజిక భద్రతా పథకాలు, ప్రయోజనాలు లేవని, అందుకోసం వారికి కేంద్రం ప్రత్యేక పథకం తీసుకురావాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోని ఇ-కామర్స్, సేవా రంగాలకు మరింత ఊతమిచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ రంగాల్లో పని చేసే సిబ్బందికి సామాజిక భద్రత కల్పించడం ద్వారా ఎక్కువ మంది వర్కర్లు సేవలందించేందుకు ముందుకొస్తారని కేంద్రం భావిస్తున్నట్లు చెప్పారు.
‘గిగ్ వర్కర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందిస్తాం. ఇ-శ్రమ్ పోర్టల్ కింద వారికి ప్రత్యేక గుర్తింపు కల్పిస్తాం. అలాగే పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పిస్తాం. దీని ద్వారా కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలుగుతుంది’ అని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
బడ్జెట్లో గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే పథకం తీసుకొస్తారని మొదటి నుంచే అంచనాలు ఉన్నాయి. ఓ సందర్భంగా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తున్న్టలు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సమితా దావ్రా చెప్పారు. ఇప్పుడు గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లు సంప్రదాయ ఉద్యోగుల కాదని కార్మిక శాఖ కార్యదర్శి దావ్రా తెలిపారు. వారికి ఎలాంటి సామాజిక భద్రతా పథకాలు, ప్రయోజనాలు లేవని, అందుకోసం వారికి కేంద్రం ప్రత్యేక పథకం తీసుకురావాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోని ఇ-కామర్స్, సేవా రంగాలకు మరింత ఊతమిచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ రంగాల్లో పని చేసే సిబ్బందికి సామాజిక భద్రత కల్పించడం ద్వారా ఎక్కువ మంది వర్కర్లు సేవలందించేందుకు ముందుకొస్తారని కేంద్రం భావిస్తున్నట్లు చెప్పారు.
వచ్చే ఐదేళ్లలో 75 వేల కొత్త మెడికల్ సీట్లు
మెడిసిన్ విద్యార్థులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు పెంచుతున్నామని తెలిపారు. యువత కోసం దేశ వ్యాప్తంగా 5 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రూ. 500 కోట్లతో విద్యలో ఏఐ ఎక్సలెన్సీ సెంటర్ పెడతామన్నారు.