Thursday, May 8, 2025

ఆపరేషన్‌ సిందూర్‌ ఆగదు అఖిలపక్ష భేటీలో రాజ్​నాథ్ సింగ్

[2:46 PM, 5/8/2025] Sampath Sir: ఆపరేషన్‌ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసారు. అంతేకాకుండా, ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ పేరిట గట్టిగా బదులిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆ ఆపరేషన్ గురించి వివరించేందుకు గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఆపరేషన్ సిందూర్​పై రక్షణ మంత్రి రాజ్​నాథ్ రాజకీయ పార్టీలకు వివరించారు. ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు పార్లమెంట్​లోని ల్రైబరీ భవనంలో గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ఎస్‌.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అధ్యక్షత వహించగా.. ప్రధాని మోదీ సందేశాన్ని రాజ్‌నాథ్ వినిపించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాదులకు గట్టిగా బదులిచ్చిందన్నారు రాజ్‌నాథ్. ఆపరేషన్ సిందూర్​పై రక్షణ మంత్రి రాజ్​నాథ్ రాజకీయ పార్టీలకు వివరిస్తూ.. భారత బలగాలు చేసిన క్షిపణి దాడుల్లో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారని స్పష్టం చేశారు.
[2:47 PM, 5/8/2025] Sampath Sir: ఈ విషయంపై ఖజువాలా సీఐ అమర్జీత్ చావ్లా వివరాలు వెల్లడించారు. ఇసుక దిబ్బల్లో బాంబు లాంటి వస్తువులు చెల్లాచెదురుగా ఉన్న ముక్కలు కనిపించాయని తెలిపారు. ఘటనాస్థలికి చూట్టూ కిలోమీటరు పరిధిలో ముక్కలు పడిఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా ఇసుకలో రెండు లోతై గుంతలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.

‘గ్రామస్థులు జాగ్రత్తగా ఉండండి’
బాంబు లాంటి వంటి వస్తువులు తమ గ్రామ సీపంలో ఉండటం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు, స్థానిక అధికారులు వారిని జాగ్రత్తా ఉండాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద వస్తువు చూసినా, వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్​లోనే కాకుండా పంజాబ్, జమ్ముకశ్మీర్​​ సరిహద్దు గ్రామాల్లో క్షిపణి/బాంబు శకలాల వంటి వస్తువలు కనిపించాయి. పంజాబ్​లోని జెతువాల్, మఖాన్ విండి, పంధేర్​ గ్రామాల్లో ఈ శకలాలను స్థానికులు గుర్తించారు. దీంతో స్థానికంగా ప్రజలు ప్రజాందోళనలకు గురయ్యారు. ఇక అమృత్​ జిల్లాలోని ఓ సరిహద్దు గ్రామంలో కూడా ప్రొజెక్టైల్​ శకలం ఆందోళనకు గురిచేసింది. జమ్ముకశ్మీర్​లో బార్డర్​ విలేజ్​లో కూడా ఓ బాంబు శకలం కలకలం రేపింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడుల దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడింది. పాక్, ఏఓకేలోని ఉగ్రకోటలు మట్టిదిబ్బలుగా మారాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రముఠాల స్థావరాలు ధ్వంసం అయ్యాయి. అందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటికొచ్చాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com