Saturday, September 21, 2024

ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురును హత్య చేసిన తల్లిదండ్రులు

ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కాలంలోను పరువు హత్యలు ఆగడం లేదు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్న కూతుళ్లను పరువు కోసం హత్య చేస్తున్నారు కుటుంబసభ్యులు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఇలాంటి పరువు హత్యే జరిగింది. కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో జరిగిన పరువు హత్య కలకలం రేపుతోంది. పద్మనాభునిసత్రం పల్లిపాళేనికి చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె శ్రావణి(24)కి ఆరేళ్ల క్రితం పెళ్లి చేయగా.. మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయి తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. వీరికి గ్రామంలో కూరగాయల షాపు ఉంది. ఈ క్రమంలో శ్రావణికి నార్తుఆములూరుకు చెందిన రబ్బానీ బాషాతో పరిచయం ఏర్పడింది.
అది కాస్త ఇష్టంగా మారి 20 రోజుల కిందట కసుమూరు దర్గాలో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు నార్త్‌ ఆములూరుకు వెళ్లి.. కూతురు శ్రావణిని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు. పెళ్లి విషయంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి.. శ్రావణిని కొట్టడంతో తీవ్ర గాయమై చనిపోయింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో గుంత తీసి పూడ్చిపెట్టారు. పోలీసులకు తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వారి ఇంటి సమీపంలోని మహిళ మృతదేహాన్ని పూడ్చి పెట్టారంటూ గురువారం గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసిచెప్పడంతో రంగంలోకి దిగారు. పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్థులను ఆరా తీయడంతో పాటు శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం బయటకొచ్చింది. అనుమానాస్పద ప్రదేశంలో తవ్వగా శ్రావణి మృతదేహం బయటపడిం

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular