Sunday, March 30, 2025

Pastor Praveen’s death సీసీ ఫుటేజ్‌తో పాటు కొన్ని ఆధారాలు సేకరించాం: జిల్లా ఎస్పీ

హైదరాబాద్‌ తిరుమలగిరి సమీపంలోని ఎస్‌బీహెచ్‌ కాలనీకి చెందిన క్రీస్తు సందేశకుడు, ప్రసంగికుడు పగడాల ప్రవీణ్‌కుమార్‌(45) మృతి చెందిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా రాజమ హేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ప్రవీణ్‌ మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందలేదని, హత్యేనని పాస్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కిషోర్‌ రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

‘‘రోడ్డు పక్కన మృతదేహం పడి ఉందని మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం పక్కనే సెల్‌ఫోన్‌ గుర్తించారు. చివరి ఫోన్‌ కాల్‌ రామ్మోహన్‌ ఆర్‌జేవైకి వెళ్లినట్టుగా ఉంది. పోలీసులు ఆయనకు ఫోన్‌ చేయగా.. రామ్మోహన్‌, అతని భార్య ఘటనాస్థలికి చేరుకుని ఆ మృతదేహం ప్రవీణ్‌దిగా గుర్తించారు. ప్రవీణ్‌ హైదరాబాద్‌లో ఉంటారని, వివిధ ప్రాంతాల్లో మత బోధకుడిగా సేవలందిస్తారని తెలిపారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాం. ప్రవీణ్‌ బావమరిది నిన్న సాయంత్రం వచ్చి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు ఇవ్వడంతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశాం.

ఘటనా స్థలిలో డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌తో కొన్ని ఆధారాలు సేకరించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని నిర్ణయించాం. టీమ్‌ ఆఫ్‌ డాక్టర్స్‌తో పోస్టుమార్టం చేయించాం. ఈ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్‌ చేయించాం. కొవ్వూరు టోల్‌ గేట్‌ సమీపంలో, కొంతమూరు వద్ద.. ప్రవీణ్‌ ద్విచక్రవాహనంపై వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ సేకరించాం. సోమవారం రాత్రి 11.43 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ని బట్టి తెలుస్తోంది. అర్ధరాత్రి 11.31 నుంచి 11.42 వరకు 12 నిమిషాలు కీలకం.

11.42 గంటలకు ఒక కారుతో పాటు ఐదు వాహనాలు ప్రవీణ్ బుల్లెట్‌ను దాటుకొని వెళ్లాయి. రెడ్‌ కలర్‌ కారు, ప్రవీణ్‌ ప్రయాణిస్తున్న బుల్లెట్‌ ఒకేసారి వెళ్లాయి. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఎస్సైలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. మాకు లభ్యమైన ఆధారాలపై లోతుగా దర్యాప్తు చేస్తాం. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని కోరుతున్నాం. పోస్టు మార్టం అనంతరం ఆందోళనకారులను ఒప్పించి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించాం’’ అని జిల్లా ఎస్పీ తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com