కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేల ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరో ఎమ్మెల్యే కూడా చేరిపోయాడు. పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ నేత గాలి అనిల్ కుమార్సోమవారం సాయంత్రం కండువా కప్పి సీఎం రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు.
గాలి అనిల్కుమార్ ప్రస్తుతం బీఆర్ఎస్ నేత కాగా.. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళా యాదవ్, తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ లోకి పలువురు కార్పొరేటర్లు,అనుచరులు చేరిపోయారు.