- ఆ అమ్మాయి కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్
- కనిపెట్టాలని పోలీసులను ఆదేశించిన డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ అప్పుడ రంగంలోకి దిగారు. తనదైన స్టైల్లో ప్రజల సమస్యలపై దృష్టి సారించారు. జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం చేపట్టిన పవన్ కళ్యాణ్.. అక్కడికి వచ్చిన వారు విన్నవించిన సమస్యల పట్ల వేగంగా స్పందిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత జనసేన కార్యాలయంలోకి వెళ్తూ జనవాణి కేంద్రంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన జనాలను చూసిన తన కాన్వాయి ఆపి మరీ వారితో ట్లాడారు పవన్ కళ్యాణ్.
రోడ్డుపైనే సింపుల్ గా కుర్చి వేసుకుని కూర్చుని మరీ వారి సమస్యలు తెలుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే భీమవరానికి చెందిన ఓ మహిళ తన కూతురు కనిపించడం లేదంటూ పవన్ కళ్యాణ్ ఎదుట కన్నీరుమున్నీరైంది. విజయవాడలో చదువుకుంటున్న తన బిడ్డను ప్రేమ పేరుతో ట్రాప్ చేశారని బోరున విలపించింది. మైనర్ అయిన తన కుమార్తె గత తొమ్మిది మాసాలుగా కనిపించడం లేదని వాపోయింది. మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేచేసినా.. పోలీసులు పట్టించుకోవడం లేదని పవన్ కళ్యాణ్ కు విన్నవించింది.
సదరు మహిళ బాధను పూర్తిగా విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమెకు అండగా ఉంటామని హామి ఇచ్చారు. కనిపించకుండా పోయిన ఆమె కుమార్తెకు సంబందించిన కేసు ఎఫ్ఐఆర్ కాపీని స్వయంగా పరిశీలించారు. అక్కడి నుంచే మాచవరం పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి సీఐతో మాట్లాడి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక కనిపించకుండా పోయిన కేసు మీద వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు పవన్ కళ్యాణ్.