Friday, April 18, 2025

పిసిసి చీఫ్, సిఎం రేవంత్ రెడ్డి ఆదేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరా

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
పిసిసి చీఫ్, సిఎం రేవంత్ రెడ్డి ఆదేశంతోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ కార్యకర్తలకు పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తనతో పాటు కార్యకర్తలు కూడా నడుచుకోవాలని ఆయన సూచించారు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అప్పటి అధికార పార్టీ బిఆర్‌ఎస్‌లో చేరి తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారని, అదే తరహాలో తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరానని సంజయ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీలో ఉన్నా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తన చేరికపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సమాచారం లేదని ఆయన తెలిపారు. కాగా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక వ్యహరహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com