Tuesday, March 11, 2025

‘పిచ్చిగా నచ్చాశావే’ రిలీజ్

“బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా “గం..గం..గణేశా”. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఈ నెల 31న “గం..గం..గణేశా” సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రేపు మద్యాహ్నం 12.06 నిమిషాలకు “గం..గం..గణేశా” సెకండ్ సింగిల్ ‘పిచ్చిగా నచ్చాశావే’ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ,‌ ప్రగతి శ్రీవాస్తవ మద్య రొమాంటిక్ లవ్ సాంగ్ గా ఈ పాట రూపొందించారు. ఈ సమ్మర్ లో టాలీవుడ్ నుంచి వస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీగా “గం..గం..గణేశా” పై అంచనాలు ఏర్పడుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com