ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు ను సిట్ బృందం బుధవారం రెండవ సారి విచారణ సాగిస్తుంది. సోమవారం విచారణ సంబర్భంగా తదుపరి విచారణకు ప్రభాకర్ రావు అప్పుడు ఉపయోగించిన సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ తీసుకరావాలని ఆదేశించారు. ఈ మేరకు రెండోసారి విచారణకు హాజరైన ప్రభాకర్ రావు నుంచి వ్యక్తిగత సెల్ ఫోన్లను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. అయితే, తొలిసారి విచారణ సందర్భంగా సిట్ అధికారులను ప్రభాకర్రావు ఎదురు ప్రశ్నించారు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయంటూ ఎదురుతిరిగారు. దీంతో ఇప్పుడు తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ సిట్ పోలీసులు సీరియస్గా ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారం ఉన్న అధికారిక హార్డ్ డిస్క్ లను మాజీ డీఎస్సీ ప్రణీత్ రావు ధ్వంసం చేయడంపైన, డీసీపీ రాధ కిషన్ రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్ల సమాచారం ముందు పెట్టి ప్రభాకర్ రావును సిట్ విచారిస్తుంది. వారంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగినట్లుగా గతం వెల్లడించారు. ఈ నెల 9న దాదాపు 8 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించింది. డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో సిట్ బృందం ఆయనను విచారిస్తుంది.