Saturday, April 19, 2025

ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో పురోగతి..

  • ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో మరో మృతదేహం లభ్యం
  • మృతుడు ఉత్తర ప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్ గా గుర్తింపు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో గత ఫిబ్రవరి 22న టన్నెల్‌ లో ‌ప్రమాదం జరగగా ఎనిమిది మంది కార్మికులుఇంజనీర్లుమిషన్‌ ఆపరేటర్లు చిక్కుకొని జలసమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి పలు రెస్క్యూ టీంలు రేయింబవళ్లు వారి ఆచూకీ కోసం పనిచేస్తున్నాయి. ఈ కమ్రంలోనే మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్‌ ‌కింద కన్వేయర్‌ ‌బెల్టు డ్రమ్‌కు 40 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి.

టన్నెల్‌ లో ‌మినీ జెసిపి ద్వారా శిథిలాలు తొలగించడంమట్టి బురదను బయటకు పంపడం సహాయక చర్యలు కొనసాగుతుండగా శిథిలాల కింద మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. అట్టి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉండడంఆ ప్రదేశం భరించలేని దుర్వాసన వస్తుండడంతో మిగిలిన ఆరుగురి మృతదేహాలు కూడా అదే ప్రదేశంలో ఉండే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. రెస్క్యూ బృందాలు దుర్వాసన వొస్తుండడంతో స్ప్రే బాటిల్స్ ‌తీసుకొని లోపలికి వెళ్లారు. మృతదేహాన్ని బయటకు తీయడానికి టిబిఎం మిషన్‌ ‌పరికరాలు గ్యాస్‌ ‌కట్టర్‌ ‌ద్వారా తొలగించడంమృతదేహం చుట్టూ భారీగా పేరుకుపోయిన శకలాలుమట్టి బురద తొలగించడం లాంటి సహాయక చర్యలు వేగవంతం చేసి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు.  


మనోజ్ కుమార్  కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా
ఎస్ఎల్బిసి టన్నెల్ లో మంగళవారం జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీలో ఇంజనీర్ గా విధులు నిర్వహించిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్తెలిపారు. ప్రభుత్వం తరఫున 25 లక్షల ఎక్స్ గ్రేషియా వారి కుటుంబ సభ్యులకు అందించనున్నట్లువైద్య పరీక్షల అనంతరం మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించనున్నట్లు తెలిపారు. కాగా,  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లా బంగార్మౌ గ్రామానికి చెందిన మృతుడు మనోజ్ కుమార్ కు.. భార్య స్వర్ణలతకుమారుడు ఆదర్శ్కుమార్తె శైలజతల్లి జమున దేవి ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com