Saturday, March 15, 2025

రవాణా శాఖ లో పదోన్నతుల ఉత్తర్వులు జారీ

మంత్రి పొన్నం ప్రభాకర్ కు అధికారుల కృతజ్ఞతలు

ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రవాణా శాఖలో ఇటీవల పదోన్నతులు కల్పిస్తూ డీపీసీ ఆమోదముద్ర వేయగా.. వారందరికీ ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీటీసీలను జేటీసీలుగా, ఆర్టీవోలను డీటీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖలో పెండింగ్ లో ఉన్న పదోన్నతులు కల్పించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ను జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా పదోన్నతులు పొందిన మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, శివ లింగయ్య డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా పదోన్నతులు పొందిన రవీందర్ కుమార్, వాణి, సదానందం, కిషన్, సురేష్ రెడ్డి లు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో ఈ పదోన్నతులు సాధ్యమయ్యాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ కుమార్, తెలంగాణ గ్రూప్– 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు రహదారి భద్రతను పెంపొందించడానికి కృషి చేయాలని పదోన్నతి పొందిన అధికారులకు మార్గ నిర్దేశనం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com