Sunday, April 20, 2025

రేపు నాగర్‌కర్నూలు జిల్లాలో పర్యటించనున్న రాహుల్‌గాంధీ

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది ప్రచారంలో కాంగ్రెస్ నేతలు జోరు పెంచుతున్నారు. అగ్రనేతలతో ప్రచారం నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. ఆదివారం నాగర్‌కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.

అలంపూర్ ఎర్రవల్లి క్రాస్ రోడ్డులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. నాగర్ కర్నూల్ ఎంపి అభ్యర్థి మల్లు రవి విజయం కోసం రాహుల్ గాంధీ ఈ ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఏఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసిసి కార్యదర్శులు తదితరులు పాల్గొననున్నారు. ఈనెల 06, 07వ తేదీల్లో ప్రియాంకగాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com