Saturday, March 15, 2025

రాజకీయనాయకులు, ధనవంతులు కుంభమేళాలో చనిపోవాలి- పప్పు యాదవ్‌

బీహార్‌ స్వతంత్ర ఎంపీ రాజేశ్‌ రంజ్‌ (పప్పు యాదవ్‌0 వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలని ఆయన అన్నారు. అప్పుడే కుంభమేళాలో చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అక్కడ జరిగిన తొక్కిసలాటను ప్రస్తావిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభలో పప్పు యాదవ్ మాట్లాడుతూ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట తర్వాత 300-600 మంది వరకు చనిపోయారని, వారి మృతదేహాలను అక్కడి నుంచి తొలగించారని పేర్కొన్నారు. మృతులకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుంభమేళాలో చనిపోయిన వారంతా మోక్షం పొందారని ఒక బాబా చెప్పారని తెలిపారు. కాబట్టి రాజకీయ నాయకులు, సంపన్నులు, బాబాలు కూడా త్రివేణీ సంగమంలో మునిగి చనిపోయి మోక్షం పొందాలని పప్పు యాదవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com