రాష్ట్ర రహదారులకు, గ్రామీణ రోడ్లులకు టోల్ విధించే ఆలోచన లేదని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామని వివరించారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కే రోడ్లు వేశారని విమర్శించారు. ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులను సైతం వాడారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
రోడ్ల విషయంలో ఛాలెంజ్ చేస్తున్నా రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీశ్రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు కూడా హరీశ్రావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్అండ్బీ పనుల గురించి లెక్కలు తీద్దామని అన్నారు. రోడ్ల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.