గడిచిన ఆరునెలల్లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశీయ, అంతర్జాతీయ ఆఫీస్ స్పేస్ లీజు రంగంలో 40 శాతం వృద్ధిలో దూసుకెళ్తుందని రేవంత్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఈ ఏడాదిలో మొత్తం 50 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లిందనీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి అద్దె లావాదేవీల్లో 40శాతం వృద్ది కనిపించిందని స్థిరాస్తి సేవల సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించిందని సీఎం అందులో పేర్కొన్నారు.
ఫలితాలను సాధించడమే ఏకైక లక్ష్యంతో హడావిడి లేకుండా పనిచేస్తున్న సమర్థవంత ప్రభుత్వ ప్రయోజనాలివని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఇమేజ్ను పునర్నిర్మిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రయాణంలో ప్రతీ ఒక్కరికి అవకాశాలను సృష్టిస్తామని భరోసా ఇచ్చారు.