Sunday, October 6, 2024

నగరంలో రియల్​ ఎస్టేట్​ పుంజుకున్నది: ఎక్స్​ లో సీఎం రేవంత్​ రెడ్డి ట్వీట్​

గడిచిన ఆరునెలల్లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశీయ, అంతర్జాతీయ ఆఫీస్ స్పేస్ లీజు రంగంలో 40 శాతం వృద్ధిలో దూసుకెళ్తుందని రేవంత్ రెడ్డి ఎక్స్​ లో ట్వీట్ చేశారు.

ఈ ఏడాదిలో మొత్తం 50 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లిందనీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి అద్దె లావాదేవీల్లో 40శాతం వృద్ది కనిపించిందని స్థిరాస్తి సేవల సంస్థ కుష్​మన్ అండ్ వేక్​ఫీల్డ్ నివేదిక వెల్లడించిందని సీఎం అందులో పేర్కొన్నారు.

ఫలితాలను సాధించడమే ఏకైక లక్ష్యంతో హడావిడి లేకుండా పనిచేస్తున్న సమర్థవంత ప్రభుత్వ ప్రయోజనాలివని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఇమేజ్​ను పునర్నిర్మిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రయాణంలో ప్రతీ ఒక్కరికి అవకాశాలను సృష్టిస్తామని భరోసా ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular