విదేశాల్లో ప్రభాకర్ రావు Prabhakar Rao
అమెరికాలోని టెక్సాస్లో ప్రభాకర్ రావు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల విజిటింగ్ వీసా మీద ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పటికే రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో ప్రభాకర్ రావు నాలుగు తరువాత ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కేసులో సాక్ష్యాలను బట్టి విచారణను వేగవంతం చేశారు పోలీసులు.
ఇప్పటికే సంచలన కేసులు Cyber Terrorism Sections
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం కూడా చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేశారు. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై ఈ సైబర్ టెర్రరిజం కేసులు నమోదు చేస్తారు. అలాంటి ఐటీ యాక్ట్ 66(F)ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రయోగిస్తున్నారు పోలీసులు. Section 66(F) of IT Act ఐటీ యాక్ట్ సెక్షన్ 66(F) జోడీ కోర్టులో మెమో దాఖలు చేశారు. సెక్షన్ 66(F) కింద కేసు ప్రూఫ్ అయితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ 70లో 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. తాజాగా ఐటీ యాక్ట్ సెక్షన్ 66(F) కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్తో సైబర్ టెర్రరిజానికి పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదుకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు.
ALSO READ: అవినాష్ మంచోడే నేను నమ్మా : సీఎం జగన్
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావ్, తిరుపతన్న బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. బెయిల్ పిటిషన్పై ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. అరెస్ట్ అయిన వారి నుంచి ఇప్పటికే పూర్తి వివరాలను సేకరించారని నిందితుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు పోలీసులు సేకరించిన ఆధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ కౌన్సిల్ వాదించింది. మరోవైపు.. కేస్ దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని పీపీ వాదించారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది ఉత్కంఠ నెలకొంది.