ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడు ప్రభాకర్రావుకు పోలీసులు రెడ్కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్తో పాటుగా తెలుగు ఛానల్ ఎండీ శ్రవణ్రావుకు కూడా రెడ్కార్నర్ నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో ప్రభాకర్రావు కీలక నిందితుడిగా ఉన్నట్లు ఇప్పటికే విచారణలో తేలింది. అయితే, ఈ కేసు విచారణకు ముందే ఆయన విదేశాలకు వెళ్లాడు.
ముందస్తు ప్లాన్లో భాగంగానే ఆయన విదేశాలకు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇప్పటికే ప్రభాకర్రావు కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. విదేశాల నుంచి విచారణకు రావాలంటూ లుక్ అవుట్, బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చినా.. ఆయన ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో విదేశీ దర్యాప్తు సంస్థలు కూడా సహకరించనున్నాయి. దీంతో ఆయన్ను త్వరలోనే అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్నది.