Friday, February 28, 2025

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

రెండు మూడు నెలల్లో టన్నెల్‌ ‌పనుల పునఃప్రారంభం
జగన్‌తో అంటకాగి నీటి చౌర్యానికి సహకరించిన బిఆర్‌ఎస్‌
మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడి

రెండు, మూడు నెలల్లో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ‌పనులు పునః ప్రారంభిస్తా మని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. రెండు మూడు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేస్తామని అన్నారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉం దని.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ అను మ తుల గురించి మాట్లాడు తున్నారని చెప్పారు. అప్పుడు మాట్లాడని నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్‌రావు మాటలు పూర్తి అబద్దాలు, గోబెల్స్ ‌ప్రచారమేనని విమర్శించారు. ఎస్‌ఎల్బీసీ ద్వారా 30 టీఎంసీలు గ్రావిటీ ద్వారా వొస్తుంటే బీఆర్‌ఎస్‌ ‌నేతలే పనులు వదిలిపెట్టి వెళ్లారని చెప్పారు. వాళ్లు సరైన పనిచేసి ఉంటే తెలంగాణలో 30 టీఎంసీలు నీళ్లు వొచ్చి మూడు నాలుగు లక్షల ఎకరాల నల్గొండ భూములు సాగులోకి వొచ్చేవని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదాన్ని అందరికీ చూడటానికి అనుమతిస్తున్నామని చెప్పారు. వారి హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రతిపక్షంలో ఉన్న తమకు ఎలాంటి అనుమతులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వాళ్ల హయాంలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చుపెట్టి నామమాత్రపు పనులు చేశారని మండిపడ్డారు.

వారి హయాంలో నీటిపారుదుల శాఖను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్‌, ‌హరీష్‌ ‌రావులకు దక్కుతుందని చెప్పారు. తాము ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా ముందుకు పోతున్నామని చెప్పారు. వాళ్లు శ్రీశైలం లెప్ట్ ‌బ్యాంక్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం బ్లాస్ట్ ‌జరిగి.. 9 మంది చనిపోతే ఒక్కరూ కూడా ఎందుకు పరామర్శకు రాలేదని ప్రశ్నించారు. ఆరోజు రేవంత్‌ ‌రెడ్డి వొస్తుంటే కారులో అరెస్టు చేసి పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారని గుర్తుచేశారు. దేవాదులలో ఏడు మంది చనిపోతే.. అస్తి పంజరాలు ఐదేళ్ల తర్వాత దొరికాయని చెప్పారు. అప్పుడు హరీష్‌ ‌రావు ఎప్పుడైనా ఆ విషయం గురించి మాట్లాడావా అని నిలదీశారు. ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు వారి హయాంలో అడిగే నాథుడే లేరన్నారు. ఇక్కడికి వచ్చి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మీరు జగన్‌తో కుమ్మక్కై ప్రగతిభవన్‌లో విందులు, వినోదాలు చేసుకుంటుంటే జగన్‌ ‌కృష్ణానదిని దోచుకువెళ్లారని విమర్శించారు.. పాలమూరు రంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో రూ. 27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరాకు కూడా నీరందించలేదని ధ్వజమెత్తారు. ఎస్‌ఎల్‌బీసీకి కరెంట్‌ ‌కట్‌ ‌చేస్తే డీ వాటరింగ్‌ ‌చేయలేక పనులు ఆగిపోయాయని చెప్పారు. అప్పుడు జగదీశ్‌ ‌రెడ్డి మంత్రిగా ఉన్నాడు ఏమి చేశారని ప్రశ్నించారు. తనకు హెలికాప్టర్‌లో తిరగాలని తనకు ఏ మాత్రం లేదని.. తాను గతంలో పైలట్‌ను అని గుర్తుచేశారు. భారతదేశంలో టన్నెల్‌ ‌ప్రమాదాల్లో అత్యంత నిపుణులను కలిగిన 11 ఏజెన్సీలను తీసుకొచ్చి సమర్థవంతంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ‌నాయకులు చెప్పిన మాటలు అబద్దాలు అని.. ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గవర్నర్ అంటే అంత లెక్కలేనితనమా? అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com