తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదినిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం పార్థసారధిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించగా.. ఆయన పదవీకాలం ఇటీవలే ముగిసింది. మరికొన్ని రోజుల్లో ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారన్న ప్రచార సాగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కొత్త వారినే ఆ పదవిలో నియమించాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన రాణి కుముదిని నియామకం జరిగింది.