Friday, August 30, 2024

రైతుకు అండగా నిలవాలనే రుణమాఫీ

రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రైతు దేశానికి వెన్నెముక అని.. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేస్తున్నామని రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలని, అంతిమంగా రైతు సోదరులు ఆర్థికంగా బలపడడానికి రైతాంగానికి ఎల్లవేళలా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అందుకే రైతులకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నదని చెప్పారు. వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుంటుందని, వ్యవసాయ రంగం అభివృద్ధికి మించిన ప్రాధాన్యత ఈ ప్రభుత్వానికి మరొకటి లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. భవిష్యత్తులో వ్యవసాయాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. రాబోయే కాలంలో ప్రభుత్వం రైతులకు మరింత అండగా నిలుస్తుంది. రైతును రాజు చేయాలన్నది ప్రభుత్వ అంతిమ లక్ష్యమని, ఈ లక్ష్యం చేరుకోవడానికి పంట రుణ మాఫీ పథకం ద్వారా రైతన్నలకు మంచి ప్రారంభం లభించిందన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలి అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?
- Advertisment -

Most Popular