Saturday, April 19, 2025

కడియం శ్రీహరి చేరికపై స్థానిక కాంగ్రెస్ నాయకుల తిరుగుబావుట

కడియం శ్రీహరిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు తిరుగుబాటు ఎగురవేశారు. కడియం శ్రీహరి చేరికను వ్యతిరేకిస్తున్న స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ కార్యకర్తలతో స్థానిక కాంగ్రెస్ నాయకురాలు సింగాపూరం ఇందిర సమావేశమయ్యారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి కడియం శ్రీహరి తమను ఇబ్బందులకు గురి చేశారని, ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీకి తెలియచేస్తామని ఆమె తెలిపారు. 2 రోజుల్లో వేలాది మంది కార్యకర్తలతో భారీ సభ నిర్వహించి, పార్టీ నాయకులు, కార్యకర్తలు కడియం శ్రీహరి చేరికను ఏ విధంగా వ్యతికిరేస్తున్నారో అధిష్టానానికి తెలియచేస్తామని, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని సింగాపూరం ఇందిర కార్యకర్తలు, నాయకులకు హామీ ఇచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com