Tuesday, April 22, 2025

ఆమనగల్లు దగ్గర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

హైద‌రాబాద్ – శ్రీశైలం జాతీయ ర‌హ‌దారిపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆమ‌న‌గ‌ల్లు మండ‌లం రాంనుంత‌ల శివారులో ఆర్టీసీ బ‌స్సు – కారు ఢీకొన్నాయి. కారులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతులు హైదరాబాద్​ కర్మాన్​ఘాట్​కు చెందిన శివకృష్ణ వరప్రసాద్​ గౌడ్​, మేఘావత్​ నిఖిల్​, బుర్ర మణిదీప్​గా గుర్తించారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్​ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాదంపై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అతివేగం, నిద్ర మ‌త్తు కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com