గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో నెలవారీ పాసులతో ప్రయాణాలు సాగించేవారికి ఆర్టీసీ షాకింగ్ న్యూస్ చెప్పంది. బస్ పాస్ ధరలను భారీగా పెంచింది. అన్ని పాసులపై 20 శాతం పెంపును నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. పెరిగిన బస్ పాస్ ధరల పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ బస్పాస్ ధరలను ఏకంగా 20 శాతం పెంచారు. నేటి నుంచి కొత్త బస్ పాస్ ధరలు అమల్లోకి వస్తాయని ఆర్టీసీ స్పష్టం చేశారు. ప్రస్తుతం రూ.1150 ఉన్న ఆర్డీనర్ బస్ పాస్ ధరను రూ.1400కు పెంచారు. ప్రస్తుతం రూ.1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ ధరను రూ.1600కు పెంచారు.
20 శాతం పైగా బస్పాస్ రేట్లను పెంచిన ఆర్టీసీ
రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్ రూ.1,400కు పెంపు
రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ రూ.1,600కు పెంపు
రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ రూ.1,800కు పెంపు
గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ బస్పాస్ ధరలు పెంపు