రాష్ట్రంలో రైతులకు రుణమాఫీపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో తొలుత రైతులకు రుణమాఫీపై చర్చించారు.
రుణమాఫీకి కటాఫ్ తేదీని నిర్ణయిస్తూ కేబినెట్లో ఆమోదం చెప్పారు. 2023, డిసెంబర్ 9 వరకు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. రుణమాఫీతో పాటుగా పలు అంశాలపై మంత్రివర్గ సమావేశం చర్చిస్తున్నది.