Saturday, October 5, 2024

ఘనంగా సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం

సమాజ్ వాది పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం జూబ్లీహిల్స్ లో ఘనంగా జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ సమాజ్ వాది పార్టీ నేత దండు బోయిన నిత్య కళ్యాన్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 లోని దుర్గా భవాని నగర్ బస్తీలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవ తో పాటు దసరా పండుగ నేపథ్యంలో పేదల మధ్య వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో తాము పేద మహిళలకు చీరలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలంగాణ లో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు. త్వరలోనే నగరా వ్యాప్తంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బస్తీలోని 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తెలంగాణ మాదిగ దండోరా ఫౌండర్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు కూడా పాల్గొన్నారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular