మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు (SYG) తో తన కెరీర్ను న్యూ హిట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రిట్టీ, ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఎలక్ట్రిఫైయింగ్ గ్లింప్స్ తో ఇప్పటికే భారీ బజ్ను క్రియేట్ చేసింది .
నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, బ్లాక్బస్టర్ హనుమాన్ భారీ విజయం తర్వాత ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. కంటెంట్, స్కేల్ రెండింటిలోనూ అత్యున్నత స్థాయిలో దూసుకుపోతున్న SYG ఇప్పుడు ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ ని చేరుకుంది. ఈ చిత్రం 120 షూటింగ్ రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది, దాదాపు 75% షూట్ పూర్తయింది. ఈ సక్సెస్ ఫుల్ టీం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ ని రూపొందిస్తోంది.
ప్రస్తుతం, టీం మూడు భారీ సెట్లను నిర్మిస్తున్నారు, ఇవి నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్కు కీలకమైన బ్యాక్ డ్రాప్స్ గా వుంటాయి. ఈ సెట్స్లో కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు, ఇవి సినిమాలో విజువల్స్ పరంగా అద్భుతంగా, కథనం పరంగా మోస్ట్ ఎక్సయిటింగ్ గా వుండబోతున్నాయి.
సంబరాల యేటిగట్టులో సాయి దుర్గ తేజ్ కెరీర్ రీడిఫైన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర ఇప్పటివరకు అతని కెరీర్లో మోస్ట్ పవర్ ఫుల్, ఎమోషన్స్ పరంగా అద్భుతంగా వుండబోతోంది. ఇందులోక్యారెక్టర్ కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుండటంతో ఈ పవర్ ఫుల్ గ్రిప్పింగ్ కథ కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ప్రతిష్టాత్మక తారాగణం ఈ చిత్రానికి పని చేస్తుండగా, రాబోయే రోజుల్లో అఫీషియల్ గా నటీనటులని అనౌన్స్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింతగా పెంచనున్నాయి. భారీ బడ్జెట్తో నిర్మించబడుతున్న ఈ సినిమా, సాయి దుర్గ తేజ్ కెరీర్లో, ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మైల్ స్టోన్ గా నిలవనుంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సినిమాటోగ్రఫీకి వెట్రి పళనిసామి అందిస్తుండగా సంగీతం బి. అజనీష్ లోక్నాథ్ సమకూరుస్తున్నారు, నవీన్ విజయ కృష్ణ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైన్ గాంధీ నడికుడికర్ ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 25న పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.