లావణ్య, రాజ్తరుణ్ కేస్ గురించి అందరికీ తెలిసిందే. గత ఆరు నెలలుగా ఈ కేసు మీద రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ మళ్ళీ మొదలై ఈ కేసులో ఎవరెవరో కొత్త వ్యక్తులు రావడం అన్ని విషయాలు బయటకు రావడం. మస్తాన్ సాయి అనే వ్యక్తి రావడం అతని బండారం అంతా బయటపడడం పోలీసులు దర్యాప్తు చేసి మస్తాన్సాయిని అరెస్ట్ చేయడం అంతా జరిగిపోయింది. అయితే ప్రస్తుతం సీన్ మొత్తం రివర్స్ అయింది. రాజ్తరుణ్ కేస్ ఏమయిందో తెలియదుగానీ సీన్ మొత్తం మస్తాన్సాయి మీదకు వెళ్ళిపోయింది. మస్తాన్ సాయి తనపై అత్యాచారం చేశాడని రాజ్ తరుణ్ భార్యగా చెప్పుకుంటున్న లావణ్య సంచలన విషయాన్ని వెల్లడించారు. తనను వంచించినట్టే ఎంతోమంది యువతులను మస్తాన్ చెరబట్టాడని తెలిపారు. తన న్యూడ్ వీడియోలు తీశాడని, వాటితో బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పారు. మస్తాన్ సాయితో కలిసి తాను పార్టీల్లో పాల్గొన్నానని… అప్పుడు మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేశాడని, ఆయన హార్డ్ డిస్క్ లో ఆ వీడియోలను చూశానని తెలిపారు. మస్తాన్ సాయి నిజ స్వరూపం బయటపెట్టాలన్న ఉద్దేశంతో ధైర్యం చేసినట్టు చెప్పారు. రాజ్ తరుణ్ పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని తెలిపారు.
తనకు మస్తాన్ సాయి తల్లదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని లావణ్య ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లు తనను చంపేస్తారని అన్నారు. గడప దాటాలన్నా భయపడుతున్నానని చెప్పారు. అన్ని వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నానని… మస్తాన్ సాయిపై న్యాయపోరాటం చేస్తానని అన్నారు. తన పోరాటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టించుకోనని చెప్పారు.