ఇవాళ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్-8లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ప్రవేశించారు. అయితే, ఒక్కొక్కరిని కాకుండా… ఈ 14 మందిని ఏడు జంటలుగా చేసి బిగ్ బాస్ ఇంట్లోకి పంపడం ఈ సీజన్ స్పెషాలిటీ. గత సీజన్ తో పోల్చితే ఈ సీజన్ లో అనేక ట్విస్టులు, లిమిట్ లెస్ ఫన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కంటెస్టెంట్లలో టీవీ నటులు, యూట్యూబర్లు ఉన్నారు.
హౌస్ లోకి వెళ్లిన జోడీలు
1. యష్మి గౌడ-నిఖిల్
2. అభయ్ నవీన్- ప్రేరణ
3. ఆదిత్య ఓం- ఆకుల సోనియా
4. బెజవాడ బేబక్క-శేఖర్ బాషా
5. కిరాక్ సీత- నాగమణికంఠ
6. పృథ్వీరాజ్- విష్ణుప్రియ
7. నైనిక-నబీల్ అఫ్రిది
వీరిలో యష్మి, నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్ టీవీ నటులు కాగా… ఆదిత్య ఓం, అభయ్ నవీన్, సోనియా సినీ నటులు. శేఖర్ బాషా రేడియో జాకీ కాగా… బెజవాడ బేబక్క, నాగమణికంఠ, నబీల్ అఫ్రిది, కిర్రాక్ సీత యూట్యూబర్లు. విష్ణుప్రియ టీవీ యాంకర్ కాగా… నైనిక డ్యాన్సర్.