Sunday, February 23, 2025

నిఖిల్ తర్వాత తండ్రి కానున్న మ‌రో స్టార్ హీరో

2020లో డాక్టర్ పల్లవి వర్మను వివాహం చేసుకున్న నటుడు నిఖిల్ సిద్ధార్థ త్వరలో తన అభిమానులకు శుభవార్త అందించనున్నారు. వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో ఆయన భార్యను చూసిన‌వారికీ విష‌యం అర్థ‌మైంది. అయితే, తాజాగా నటుడు శర్వానంద్ మరియు అతని భార్య రక్షిత కూడా తల్లిదండ్రులు కానున్నార‌ని టాక్‌. ఇక సినిమాల విష‌యానికొస్తే.. నిఖిల్ ప్రస్తుతం “ది ఇండియా హౌస్” మరియు “స్వయంభు అనే రెండు పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఇందుకోసం తీవ్రంగా శారీరక శిక్షణను తీసుకుంటున్నార‌ని తెలిసింది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో “విరూపాక్ష” హీరోయిన్ సంయుక్త మీనన్ న‌టిస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com