- రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన
- శివసేన ఎమ్మెల్యే సంజయ్పై కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మహారాష్ట్ర ఎమ్మెల్యేపై తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు కేసు నమోదు చేయించారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్పై నల్గొండ జిల్లా, శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కేసు నమోదు చేసి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.
శివసేన ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా, మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన సంజయ్ గైక్వాడ్ సోమవారం రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాలుకను నరికి తెచ్చిన వారికి రూ. 11 లక్షలు రివార్డును అందజేస్తానని సంచలన ప్రకటన చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు