అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజలెస్లో భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో ఏంజలెస్ పోలీస్ డిపార్ట్మెంట్, నేషనల్ గార్డ్ దళాలు వారిని అడ్డుకునేందుకు రబ్బర్ బుల్లెట్స్తో కాల్పులు జరిపారు. ఆ సమయంలో రిపోర్టింగ్ చేస్తోన్న ఓ మహిళా రిపోర్టర్పై ఓ జవాన్ రబ్బర్ బుల్లెట్తో కాల్చారు. ఈ ఘటన కెమెరాలో రికార్డయింది.