Saturday, April 19, 2025

సిద్దిపేట రాజీవ్‌ రహదారి పై ధర్నా

– రహదారి పై భారీ ట్రాఫిక్‌ జామ్‌
-వాహనదారుల ఇక్కట్లు
-పట్టించుకోని అధికారులు
– గ్రామస్తుల అగ్రహం

సిద్ధిపేట జిల్లాలోని రాజీవ్‌ రహదారిపై లక్ష్మక్కపల్లి గ్రామస్తుల ధర్నా నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. రాజీవ్ రహదారి ప్రక్కన కోట్ల విలువచేసే స్థలాన్ని ప్రయివేట్ వ్యక్తులు కొంతమంది అక్రమంగా ఖబ్జా చేశారంటూ స్థానికులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ప్రయోజనంలేకుండా పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమ ఆవేదనను పట్టించుకోవడం లేదంటున్నారు. స్థానికులు ఆ స్థలంపై తమకు హక్కులు కల్పించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. మాజీ కలెక్టర్‌ అయిన వెంకట్‌రామిరెడ్డి. బిఆర్‌ఎస్‌ నేతల పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com