ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సింహాచలం బస్టాండ్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూ లైన్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
మంగళవారం (ఏప్రిల్ 29) అర్థరాత్రి దాటిన తరువాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. ఆ కారణంగానే గోడ కూలింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. గోడ కూలిన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎష్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.