Saturday, June 29, 2024

టిఎస్‌ఎండిసిలో ఆరుగురు అధికారులపై వేటు

ముగ్గురు జిఎంలు, ముగ్గురు పిఓలు మాతృసంస్థకు…
టిఎస్‌ఎండిసి (రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)లో పనిచేస్తున్న ఉద్యోగుల అవినీతిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు జిఎంలు, మరో ముగ్గురు పిఓలపై ప్రభుత్వం వేటు వేసింది.

వేటు పడిన వారిలో టిఎస్‌ఎండిసిలో డిప్యూటేషన్‌పై జిఎంలుగా పనిచేస్తున్న పాండురంగారావు, దేవేందర్ రెడ్డి, ప్రశాంతిలతో పాటు ప్రాజెక్టు ఆఫీసర్స్ (పిఓలు) దశరథం, తోట శ్రీధర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌లను మాతృసంస్థలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి, ఆక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular