అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో కీలక పరిణామం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో Amit Shah morphing video case కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అకౌంట్ నడిపిస్తున్న అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ మార్ఫింగ్ కేసును ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అమిత్ షా ఫేక్ వీడియో తెలంగాణ ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 22 మంది కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు.
ALSO READ: రేపు నాగర్కర్నూలు జిల్లాలో పర్యటించనున్న రాహుల్గాంధీ
మరోవైపు తెలంగాణలో కూడా టిపిసిసి సోషల్ మీడియా టీమ్కు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసుల బృందం మకాం వేశారు. ఈ కేసులోనే టిపిసిసి సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలను తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా వారికి కోర్టు కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది.