గురువు అంటే దైవంతో సమానం అంటారు. కానీ నేటి తరానికి అవేమి పట్టలేదు. గురువులకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. ఇటీవలె ఓ కాలేజీ లెక్చరర్ పై విద్యార్థిని దాడి చేసిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సెల్ ఫోన్ లాక్కుందని లెక్చరర్ ను అసభ్యంగా తిట్టడంతో పాటు చెప్పుతో కొట్టింది. ఈ ఘటనపై రఘు విద్యాసంస్థల చైర్మన్ రఘు ప్యాకల్టీతో సమావేశమై ఘటనపై చర్చించారు.
తాజాగా దీనిపై కాలేజీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. లెక్చరర్ పై దాడికి సంబంధించిన ఘటనపై విచారణ జరిపించామని యాజమాన్యం పేర్కొంది. లేడీ ఫ్యాకల్టీపై చేయిచేసుకోవడం, తిట్టడం వంటి చర్యల కారణంగా ఈసీఈ సెకండ్ ఇయర్కు చెందిన వెంకటలక్ష్మీ అనే విద్యార్థిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. కాగా, విద్యార్థిని తనపై దాడి చేయడంతో మనస్తాపం చెందిన లెక్చరర్ రాజీనామా చేసినట్లు సమాచారం.