వికారాబాద్, -కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్పై పలు సూచనలు చేసిన సిఎం
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వికారాబాద్, -కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ గురించి రైల్వేశాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్ వివరించారు.
వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా ఏర్పాటు చేయనున్న ఈ రైల్వే లైన్ను రూ.3,500 కోట్లతో 145కి.మీల మేర ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే లైన్ రూట్ మ్యాప్ గురించి సిఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, పర్ణిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.