Sunday, September 29, 2024

సీఎం రేవంత్​ రెడ్డికి సుప్రీం నోటీసులు

టీఎస్​ న్యూస్​: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గతంలో సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో నోటీసులపై స్పందించి సమాధానం చెప్పాలని సూచనలు చేసింది. గతంలో ఈ కేసులో ఏసీబీ అధికారులు రేవంత్‌ను అరెస్ట్ చేశారు. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ను రేవంత్ రెడ్డి కలిసి.. డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ కావడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వ‌చ్చారు. అయితే, మరోసారి ఈ కేసు వ్యవహారం తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular