హైదరాబాద్: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరిగి ఈ రోజు బీజేపీలో చేరారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పార్టీ సభ్యత్వం పొందినట్లు పత్రాన్ని అందించి ఆమెను సత్కరించారు.
తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. గత 20 ఏళ్లుగా బీజేపీ నాయకురాలి గానే కొనసాగుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది..