Sunday, September 29, 2024

అధునాతన సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు

  • రూ.2,324.21 కోట్లతో ఐటీఐల ఆధునీకరణ
  • తెలంగాణలోని 65 ఐటీఐలను ఏటిసిలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు
  • టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

ఆధునిక పరిశ్రమల (ఇండస్ట్రీ 4.0) అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకు ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటిసిలుగా) మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఐటీఐలను ఏటిసిలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 65 ఐటీఐలను ఏటిసిలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టిటిఎల్)తో పదేళ్లకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.

ఐటిసిలకు సంబంధించిన ముఖ్య అంశాలు..
1.65 ఐటీఐలను ఏటిసిలుగా అప్‌గ్రేడ్ చేస్తారు.
2.ఆధునిక పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఏటిసిల్లో యువతకు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఏటిసిల్లో అధునాతన సామగ్రి, సాంకేతికతను ఏర్పాటు చేస్తారు.
3.శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను టిటిఎల్ నియమిస్తుంది
4.ఏటిసిల్లో ఏటా 15,860 మందికి ఆరు రకాల దీర్ఘకాల (లాంగ్ టర్మ్) కోర్సుల్లో, 31,200 మందికి 23 రకాల స్వల్ప కాలిక (షార్ట్ టర్మ్) కోర్సుల్లో శిక్షణ అందిస్తారు.
5.పదేళ్లలో రాష్ట్రంలోని ఐటీఐల్లో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే శిక్షణ పొందారు. ఈ ఏటిసిలతో రానున్న పదేళ్లలో నాలుగు లక్షల మంది శిక్షణ పొందుతారు.

6.ఐటీఐలను ఏటిసిలుగా మార్చే ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,324.21 కోట్లు కాగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.307.96 కోట్లు (13.26 శాతం) కాగా, టిటిఎల్ వాటా రూ.2016.25 కోట్లు (86.74).
7.ఏటిసిలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పని చేస్తాయి. అలాగే ఈ ఏటిసిలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలకు సాంకేతిక కేంద్రాలుగా (టెక్నాలజీ హబ్) పనిచేస్తాయి.
8.ఏటిసిల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి టిటిఎల్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.
9.ఏటిసిలు భవిష్యత్‌లో తమ సేవలను పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు అందజేస్తాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular