Monday, April 21, 2025

మాంసం.. మనమూ తింటున్నాం

మాంసాహారాన్ని ఎక్కువగా తింటున్న రాష్ట్రాలివే.. టాప్ 10లో 7 స్థానంలో తెలంగాణ

మాంసాహారాన్ని ఎక్కువగా తినే రాష్ట్రాల్లో సౌత్ వెనకబడింది. తెలంగాణలో నాన్​వెజ్ ఎక్కువగా తింటారు అనుకుంటారు. కానీ ఇండియాలో మాంసాహారాన్ని ఎక్కువగా తినే టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ 7 స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణను బీట్ చేసింది. నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే (NHFS-5) ప్రకారం.. ఇండియాలో మాంసాహారాన్ని తింటున్న రాష్ట్రాల లెక్క తీశారు.

టాప్ 10 రాష్ట్రాలివే..
NHFS-5 చేసిన సర్వే ప్రకారం.. భారత్​లో మాంసాహారాన్ని ఎక్కువగా తింటున్న రాష్ట్రాల్లో నాగాలాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో 99.8% మంది ప్రజలు నాన్​ వెజ్ తింటున్నారట. తర్వాతి స్థానంలో 99.3 శాతంతో పశ్చిమ బెంగాల్ ఉంది. మూడో స్థానంలో 99.1 శాతంతో కేరళ ఉండగా.. 98.25 శాతంతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత తమిళనాడు 97.65శాతం ఉండగా, ఒడిశా 97.35, తెలంగాణ 97.3తో 7 స్థానంలో నిలిచింది. ఎనిమిదో స్థానంలో 97 శాతంలో జార్ఖండ్, త్రిపుర 95, గోవా 93.8తో చివరి స్థానంలో ఉంది.

నాన్​వెజ్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అలాగే నష్టాలు కూడా ఉంటాయి. రోజూ నాన్​వెజ్ తినడం తప్పు కాదు కానీ.. ఎలా తినాలో తెలియకపోతేనే ఆరోగ్యానికి నష్టాలు కలుగుతాయి. మరి మాంసాహారాన్ని ఎలా తినాలి? ఎలా డైట్​లో చేర్చుకుంటే మంచిది.. నాన్​వెజ్ ఎక్కువగా తింటే శరీరానికి అధిక నాణ్యతతో కూడిన ప్రోటీన్ అందుతుంది. ఇది కండరాల పెరుగుదలకు, నిర్వహణకు మంచిది. అలాగే మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పనితీరుకు మంచివి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మంచివి. విటమిన్ బి12 అందుతుంది. ఇది నరాల పనితీరు మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది.

ఇలా తీసుకుంటే మంచిది..
ప్రోటీన్ కోసం పౌల్ట్రీ, చేపలు తీసుకుంటే మంచిది. ప్రాసెస్ చేసిన నాన్​వెజ్​కి దూరంగా ఉండాలి. మాంసం ద్వారా వ్యాధులు రాకుండా ఉండాలంటే బాగా ఉడికించుకోవాలి. సరిగ్గా ఉడకని నాన్​వెజ్ జోలికి అస్సలు వెళ్లకూడదు. కేవలం నాన్​వెజ్​ కాకుండా.. వెజిటేబుల్స్​ని కూడా మీ ప్లేట్​లో ఉండేలా చూసుకోండి. సమతుల్య ఆహారం మంచిది.

నాన్​వెజ్​ తింటే కలిగే నష్టాలు
మాంసాహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిలోని కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్నిసార్లు బ్యాక్టీరియాతో కలుషితమై అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నాన్ వెజ్ తినేప్పుడు దొరికిందల్లా తినేయకుండా హెల్తీగా తీసుకునేందుకు ప్రయత్నించండి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com