Sunday, June 8, 2025

రవాణా శాఖలో పదోన్నతులకు డిపిసి ఆమోదం

రవాణా శాఖలో పనిచేస్తున్న డిటిసి, జెటిసిలకు పదోన్నతులకు కల్పిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది. పదోన్నతులు పొందిన వారిలో రంగారెడ్డి డిటిసి మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, మహబూబ్ నగర్ డిటిసి శివ లింగ య్యలు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లుగా, ఉప్పల్ ఆర్టీఓ వాణి, ఖమ్మం ఆర్టీఓ ఆఫ్రిన్, మెహిదీపట్నం ఆర్టీఓ కిషన్, కొత్తగూడెం ఆర్టీఓ సదానందం, నాగోల్ ఆర్టీఓ రవీందర్ కుమార్, సూర్యాపేట ఆర్టీఓ సురేష్ రెడ్డిలకు డిటిసిలుగా పదోన్నతులు కల్పిస్తూ డిపిసి కమిటీ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు రెండురోజుల్లో వెలువడనున్నాయి. త్వరలో పదోన్నతులు లభించిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com