Tuesday, June 3, 2025

ఉగ్రదాడిలో హృదయ విషాద ఘటన

– పెళ్లైన ఆరు రోజులకే భర్త బలి

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేవలం ప్రాణనష్టాన్ని మాత్రమే కాదు, ఎన్నో హృదయ విదారక ఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. ఆ దుర్ఘటనలో అల్లంత దూరం నుండి ఆనందం కోసం వచ్చిన వారి కలలు క్షణాల్లో చెదిరిపోయాయి. ఒక్కసారిగా జీవితం అంతా తల్లక్రిందలు అయిపోయింది. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి, భవిష్యత్తు అంధకారంలోకి నెట్టింది. కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ రావు తన భార్య, కుమారుడితో కలిసి వెళ్లిన విహారయాత్ర విషాదంగా ముగిసింది. భార్య కళ్ల ముందే భర్త తుపాకీ గుళ్లకు బలవడం అత్యంత హృదయ విదారకమైన సంఘటన. పెళ్లైన ఆరు రోజులకే భర్త తన కళ్లెదుట తుపాకీ గుళ్లకు బలి కావడం ఆ యువతిని శోకసంద్రంలోకి నెట్టింది. ఆ మహిళ చెప్పిన దాని ప్రకారం, ఆమె భర్త పానీ పూరీ తింటున్నప్పుడు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దుండగుల్లో ఒకరు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే తన భర్తను కాల్చి చంపారని తెలిపింది. కాల్పుల్లో గాయపడిన తన భర్తను కాపాడటానికి సహాయం చేయమని ఆ మహిళ కన్నీటితో వేడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ చిన్నారి తన తండ్రిని కోల్పోవడం, ఆ తల్లి తన జీవిత భాగస్వామిని శాశ్వతంగా దూరం చేసుకోవడం తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఉగ్రదాడిపై సమీక్ష” అలాగే, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పర్యాటకుల పరిస్థితి కూడా అంతే విషాదకరంగా ఉంది. కొందరు తమ జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలను మూటగట్టుకుందామని వస్తే, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వారి కుటుంబాల్లో నెలకొన్న దుఃఖాన్ని వర్ణించలేని స్థితిలో ఉన్నాయి. ఈ దాడిలో గాయపడిన వారి పరిస్థితి కూడా దయనీయంగా ఉంది.

 

 

 

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com