Monday, May 19, 2025

సచివాలయ భద్రత బాధ్యతలు టిజిఎస్పీఎఫ్‌కు అప్పగింత

టిజిఎస్పీఎఫ్ కమాండెంట్‌గా దేవిదాస్ నియామకం
సచివాలయ భద్రత బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగానికి ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలోనే టిజిఎస్పీఎఫ్ కమాండెంట్ దేవిదాస్‌ను ప్రధాన భద్రతాధికారిగా ప్రభుత్వం నియమించింది. సచివాలయానికి మొత్తం 212 మంది సిబ్బందిని కేటాయించారు.

వారంతా గస్తీ, సాయుధ గార్డులుగా విధులు నిర్వర్తించనున్నారు. దీంతో శుక్రవారం నుంచి టిజిఎస్పీఎఫ్ సిబ్బంది ఒక్కొక్కరుగా విధుల్లో చేరారు. రాష్ట్ర సచివాలయానికి ఉన్న తెలంగాణ స్పెషల్ పోలీస్ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే తొలగించడంతో ఆ స్థానంలో టిజిఎస్పీఎఫ్ చేరింది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com