Monday, March 24, 2025

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష

మందబలంతో ప్రజాస్వామ్యాన్ని నడపలేరు
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: మాజీ మంత్రి కేటీఆర్‌

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో అవలంబిస్తోందని మాజీమంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్యం మంద బలం ఆధారంగా నడవరాదని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి కేటీఆర్‌ హాజరై మాట్లాడారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో 14 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమం నడిపించారని గుర్తుచేశారు. 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నామని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటామని తెలిపారు. అస్తిత్వంహక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చిందన్నారు. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచీ లెక్క పని చేస్తుందన్నారు.

డీలిమిటేషన్‌ వల్ల అనేక నష్టాలుకేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాలతో దక్షిణాది రాష్ట్రాలకు అనేక నష్టాలు కలుగుతాయని స్పష్టంచేశారు. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నా మనిప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు అని పేర్కొన్నారు. దేశానికి 36 శాతం జీడీపీలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌ కేవలం పార్లమెంట్‌ ప్రాతినిధ్యం తగ్గడమే కాదు.. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.

మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందన్నారు. ఎన్డీఏ పాలనలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష మరింత పెరిగిందన్నారు. వివక్షను కొనసాగించేందుకు డీలిమిటేషన్‌ అంశాన్ని ముందుకు తీసుకొస్తుందన్నారు. బుల్లెట్‌ రైలు వంటి ప్రాజెక్టులను ఉత్తరాదికే పరిమితం చేయడం ఒక ఉదాహరణ అని.. జనాభా దామాషా ప్రకారం డీలిమిటేషన్‌ జరిగితేనే దేశ సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతుంది అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com