Monday, April 21, 2025

దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా…

  • ముందుగా గన్‌పార్క్‌లో అమర వీరుల స్థూపం వద్ద అమరులకు నివాళి
  • అర్పించనున్న సిఎం రేవంత్ రెడ్డి
  • ఉదయం 10 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకావిష్కరణ చేయనున్న ముఖ్యమంత్రి
  • అనంతరం రాష్ట్ర అధికారిక గీతం ఆవిష్కరణ
  • తదనంతరం సోనియాగాంధీతో పాటు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిల ప్రసంగం

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. జూన్ 2వ తేదీన ఉదయం 9.30కు గన్ పార్క్‌లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు.

పోలీసు బలగాల పేరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తరువాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం శ్రీమతి సోనియాగాంధీతో పాటు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది.

సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
జూన్ 2వ తేదీ సాయంత్రం ట్యాంక్‌బండ్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్‌కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను నిర్వహిస్తారు.

స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ ఇటు చివర నుంచి అటు చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంత సేపు జయ జయహే తెలంగాణ ఫుల్ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి శ్రీ అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిలకు సన్మానం చేస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా (ఫైర్‌వర్క్) కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com