దేశ రక్షణకు అవసరమైన ఇంజినీర్లను తయారుచేస్తాం..
•హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించాలి
•నేషనల్ సైన్స్ డే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
•హాజరైన కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్
మనదేశ రక్షణ భాధ్యత యువతీ యవకులదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం అన్నారు. బీడీఎల్, డీఆర్ డీఓ, మిదాని, హెచ్ఏఎల్ వంటి దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తయారు చేస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా డిఆర్డివో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈసం దర్భంగా హైదరాబాద్ గచ్చీబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తి , దేశాన్ని రక్షించుకోవాల్సిన స్ఫూర్తిని పెంచేందుకు ప్రత్యేక ంగా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏటా లక్షకుపైగా ఇంజి నీరింగ్ గ్రాడ్యు యేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరి కాకు వెళుతున్నారు. వారిలో దేశభక్తితో, దేశ రక్షణ ప్రాధాన్యతనలు వివరించడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి కేవలం ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రమే అమెరికాకు వెళ్లకుండా, దేశ రక్షణ రంగానికి అవసరమైన సమర్ధవంతమైన ఇంజినీర్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నా మన్నారు.
దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారు చేయడం మరింత ముఖ్యం. స్వాతంత్య్రానికి ముందు కూడా, తర్వాత కూడా హైదరాబాద్లో బీడీఎల్, హెచ్ఎచ్ఎల్, మిదాని, డీఆర్డీఓ వంటి అనేక సంస్థలు దేశ రక్షణ కోసం ఉత్పత్తి రంగంలో విశేషంగా పని చేస్తున్నాయి. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్, బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి. హైదరాబా• •-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలి. దీనివల్ల భారీగా పెట్టుబడులు వొస్తాయి. రాకెట్ తయారీ సహా ఆకాశ మార్గం (స్కై రూట్) వంటి స్టార్టప్లు అభివృద్ధి చెందుతాయి. అందుకోసం కేంద్ర సహకారం, మద్దతు అవసరం. రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.