Sunday, September 29, 2024

మోహన్ బాబు ఇంట్లో దొంగతనం

తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసంలో పనిమనిషిగా ఉన్న నాయక్ అనే వ్యక్తి రూ.10 లక్షలు తీసుకుని పారిపోయాడు. ఇంట్లో డబ్బుపోయిందని తెలుసుకున్న మోహన్ బాబు రాచకోండ సీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పనిమనిషి నాయక్ కోసం వెతుకులాట ప్రారంభించి చివరకు తిరుపతిలో నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేసిన పది లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పనిమనిషి నాయక్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు పోలీసులు. కాగా గతంలోనూ మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. 2019లో డబ్బులు, బంగారం దొంగిలించినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న మోహన్ బాబు ప్రస్తుతం ఆయన వ్యాపార లావాదేవీలను చూసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular